News October 7, 2024

JK, హరియాణాలో బీజేపీ ఓడితే మార్కెట్లు క్రాష్ అవుతాయా?

image

హరియాణా, JK ఎన్నికల్లో BJP ఓడినా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. లోక్‌సభ పరంగా అవి చిన్న రాష్ట్రాలేనని పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ అవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం కొంతమేర ప్రభావం చూపిస్తాయన్నారు. వెస్ట్ఏషియా యుద్ధం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, జియో పొలిటికల్ పరిణామాల గురించే మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(TANHA) ప్రకటించింది. 323 ఆసుపత్రులకు ₹1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు ₹100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు తెలిపాయి.

News September 16, 2025

1,543 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1,543 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు. ఇంజినీరింగ్‌లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 29ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News September 16, 2025

భూమికి సమీపంగా భారీ ఆస్టరాయిడ్

image

ఓ భారీ గ్రహశకలం త్వరలో భూమికి సమీపంగా రానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2025 FA22 అనే ఆస్టరాయిడ్‌ సెప్టెంబర్ 18 ఉ.8.33 గం.కు భూమికి అత్యంత సమీపంలోకి రానుందని చెబుతున్నారు. అప్పుడు ఇది భూమికి 8,41,988 కి.మీ. దూరంలోనే ప్రయాణించనుంది. అయితే ఆ శకలం గురుత్వాకర్షణ పరిధిలోకి రాదని అంటున్నారు. దీని చుట్టుకొలత 163.88 మీ., పొడవు 280 మీ.గా ఉంది. నాసా దీని కదలికలను పరిశీలిస్తోంది.