News October 7, 2024
కాసేపట్లో ప్రధానితో సీఎం భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఈ రాత్రి లేదా రేపు ఉదయం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం.
Similar News
News March 24, 2026
మూసీ ప్రక్షాళన.. మార్పు మనతోనే మొదలవ్వాలి!

ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మన ఆలోచనా విధానం మారాలి. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలను నేరుగా నదిలో వేయడం ఆపాలి. డ్రైనేజీ కనెక్షన్లను పద్ధతిగా ఉంచుకోవడం, నీటిని పొదుపుగా వాడుతూ మురుగును తగ్గించడం మన బాధ్యత. నదిని చెత్తకుప్పగా కాకుండా నగర జీవనాడిలా గౌరవించాలి. పౌరుల క్రమశిక్షణ, ప్రభుత్వ సంకల్పం తోడైతేనే స్వచ్ఛమైన మూసీ కల నెరవేరుతుంది.
News March 24, 2026
కొలంబియా విమాన ప్రమాదం.. 8 మంది మృతి!

కొలంబియా మిలిటరీ విమాన <<19460361>>ప్రమాదం<<>>లో 8 మంది మృతి చెందారు. సోమవారం 125 మందితో బయలుదేరిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 80 మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొంత మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాయి. డ్రగ్ కార్టెల్స్ ఏరివేతలో భాగంగా సరిహద్దుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.
News March 24, 2026
IPLకు ముందు సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన గిల్

IPLకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన సక్సెస్ సీక్రెట్ను పంచుకున్నారు. తనలోని ప్రశాంతతకు తనపై తనకు ఉన్న నమ్మకం, జట్టు ఇచ్చే భరోసాయే కారణమని తెలిపారు. సోమవారం జరిగిన ‘శుభారంభ్ 2026’ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. ప్రశాంతంగా ఉండటం వల్ల పరిస్థితులను స్పష్టంగా అంచనా వేయొచ్చని, అది లాంగ్ టర్మ్ విజన్ ఇస్తుందని చెప్పారు. కోచ్ ఆశిష్ నెహ్రా కూడా తమ లక్ష్యం గెలవడమేనని స్పష్టం చేశారు.


