News October 7, 2024

అద్దంకి: ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి

image

అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రజా వేదికకు తరలివచ్చిన ప్రజలతో మంత్రి మమేకమై వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Similar News

News October 7, 2024

చిన్నగంజాంలో బాలుడు దుర్మరణం

image

ఆటో గేర్ తగిలి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన ఘటన చిన్నగంజాంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జీవన్(7) ఆగిఉన్న ఆటోను ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు హ్యాండిల్ గేర్లను తగలడంతో ఆటో ఒక్కసారిగా ముందుకు కదిలింది. వెంటనే బయపడిన బాలుడు ఆటోలో నుంచి కిందకు దూకే క్రమంలో పక్కనే ఉన్న గోడకు తల బలంగా తగలడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News October 7, 2024

త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం: ఎమ్మెల్యే తాటిపర్తి

image

ఇసుక ధరలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు ఉచిత ఇసుక ధర (18 టన్నులు) రూ.43,200 మాత్రమే. షరతులు వర్తిస్తాయి,’ అంటూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఉచిత ఇసుక అనేది బూటకపు మాటలని ఆదివారం పేర్కొన్నారు.

News October 7, 2024

ప్రకాశం జిల్లాకు మూడో స్థానం

image

నెల్లూరులో రెండు రోజులుగా జరుగుతున్న ఆట్యా పాట్యా 9వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఆటలు పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు మూడో స్థానాన్ని సాధించింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను పలువురు అభినందించారు. ప్రకాశం జిల్లా జట్లు మూడో స్థానాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆట్యా పాట్యా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసులు అన్నారు. భవిష్యత్తులో కూడా మంచి పథకాలు సాధించాలని కోరారు.