News October 7, 2024

నాంపల్లి: ‘వేయి ఒక్క రూపాయికే మూడు తులాల బంగారం’

image

నాంపల్లి మండల పరిధిలోని దేవత్ పల్లీ గ్రామంలో మల్లయ్య దేవస్థాన కమిటీ దుర్గామాత శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులను ఆకర్షించే విధంగా వినూత్న కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టారు. దాదాపు మూడు తులాల అమ్మవారి ముక్కు పోగును 1001/- రూలకే లక్కీ డ్రాలో పొందే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్వాములు ఈరోజు ఉదయం పాల్గొన్నారు. చివరి రోజున విజేతను అందరి సమక్షంలో ప్రకటిస్తామని వారు చెప్పారు.

Similar News

News March 18, 2026

నల్గొండ: కారు ఢీకొని ఒడిశా యువకుడి మృతి

image

పెద్దవూర సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన రామ్ రే (23)ను అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతను కాటన్ మిల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2026

చండూరు ఘటనపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

image

నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

News March 17, 2026

ఉగాదికి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఉగాది పర్వదినం నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల సమన్వయంతో గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న ఇండ్లు, మరుగుదొడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు.