News October 7, 2024

నాంపల్లి: ‘వేయి ఒక్క రూపాయికే మూడు తులాల బంగారం’

image

నాంపల్లి మండల పరిధిలోని దేవత్ పల్లీ గ్రామంలో మల్లయ్య దేవస్థాన కమిటీ దుర్గామాత శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులను ఆకర్షించే విధంగా వినూత్న కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టారు. దాదాపు మూడు తులాల అమ్మవారి ముక్కు పోగును 1001/- రూలకే లక్కీ డ్రాలో పొందే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్వాములు ఈరోజు ఉదయం పాల్గొన్నారు. చివరి రోజున విజేతను అందరి సమక్షంలో ప్రకటిస్తామని వారు చెప్పారు.

Similar News

News January 25, 2026

NLG: ఈయన జర్నీ ఎందరికో స్ఫూర్తి

image

దళిత కుటుంబంలో జన్మించినా తన తలరాతను తానే రాసుకోవాలనే దృఢ సంకల్పమే పి.చంద్రయ్యను ఉన్నత స్థానానికి చేర్చింది. చదువును ఆయుధంగా మలుచుకొని, అనేక అవరోధాలను అధిగమిస్తూ ఆయన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమితులయ్యారు. శాలిగౌరారం (M) ఇటుకల పహాడ్ అనే చిన్న గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణం సాగింది. 31 ఏళ్ల నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే చివరకు ఆయనను ఐఏఎస్ చేసింది.

News January 25, 2026

నల్గొండ: మున్సిపల్ పోరు.. ఇన్‌ఛార్జిలు వీరే..

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ కార్పొరేషన్‌కు MLC కోటిరెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించింది. అలాగే నందికొండకు యుగేంధర్ రావు, హాలియాకు విజయసింహారెడ్డి, దేవరకొండకు పాల్వాయి స్రవంతి, మిర్యాలగూడకు లింగయ్య యాదవ్, చండూరుకు వెంకటనారాయణ గౌడ్, చిట్యాలకు చాడ కిషన్ రెడ్డిలను ఇన్‌ఛార్జిలుగా ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను వీరికి అప్పగించింది.

News January 25, 2026

NLG: ఇక నియోజకవర్గంలోనే యూరియా బుకింగ్

image

రైతుల ఇబ్బందులను తీర్చేందుకు వ్యవసాయ శాఖ నియోజకవర్గ స్థాయిలోనే ప్రత్యేక యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆ యాప్‌లో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. దీంతో నియోజకవర్గ పరిధి యాప్‌లోనే యూరియా బుక్ చేసుకునేలా శనివారం నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 4,38,529 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు.