News October 7, 2024

అనకాపల్లి: కలెక్టరేట్ పరిష్కార వేదికకు 232 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సంస్థలపై 232 అర్జీలను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News March 10, 2026

విశాఖలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

image

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించి అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,35,000 చలానా విధించారు.

News March 10, 2026

మధురవాడ: మహిళా దినోత్సవం వేడుకలు.. పురుషులకు వంట పోటీలు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా భీమిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వాంబేకాలనీలో వినూత్నంగా పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు. 9వ రోజు కార్యక్రమంగా జరిగిన ఈ పోటీలలో స్థానిక పురుషులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. కుటుంబ బాధ్యతల్లో పురుషుల భాగస్వామ్యం, మహిళల పట్ల గౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

News March 10, 2026

కేజీహెచ్ వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు

image

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్‌కు చెందిన ఇద్దరు వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. గైనిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ వాసుపల్లి రవికి 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.