News October 7, 2024
మూడు పూటల కష్టం.. ఫలితం 33 పైసలు

వినియోగదారులు చెల్లించే ధరలో కూరగాయలు, పండ్ల రైతులు 30% మాత్రమే పొందుతున్నారని RBI ఓ రిపోర్టులో పేర్కొంది. అంటే మనం KG ₹100కు కొంటే వారికి ₹30 దక్కుతోంది. మిగతాది దళారులు, టోకు వర్తకులు, రిటైల్ వ్యాపారులు వంటి వారికి వెళ్తోంది. కొన్ని పంటలు చూస్తే టమాటాలకు 33%, ఆలూ- 37%, అరటి- 31%, మామిడి: 43%, ద్రాక్ష: 35% చొప్పున శ్రమజీవికి చెందుతోంది. ఇక డెయిరీ, గుడ్ల రైతులకు మాత్రం ఇది 70%, 75% కావడం గమనార్హం.
Similar News
News January 2, 2026
శబరిమల బంగారం చోరీ.. CBI దర్యాప్తు అవసరం లేదు: కేరళ CM

శబరిమల బంగారం చోరీ కేసులో CBI దర్యాప్తు డిమాండ్లను కేరళ CM విజయన్ తోసిపుచ్చారు. SIT దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతోందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలర్, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాశ్, ఆంటోని కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు.
News January 1, 2026
విషపు నీళ్లు!

దాహం తీర్చాల్సిన నీళ్లే విషమై ప్రాణం తీసిన <<18729199>>ఘటన<<>> యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. MP ఇండోర్లో నీళ్లు కలుషితమై 6 నెలల పసికందు సహా 10 మంది మరణించడం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. తాగునీటి పైప్లైన్లో మురికినీరు ఎక్కడ కలుస్తుందో మున్సిపల్ అధికారులు ఇప్పటికీ కనుక్కోలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. 10 రోజులైనా బాధిత ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించలేని దౌర్భాగ్యం.
News January 1, 2026
టెంపో డ్రైవర్ టు శంఖ్ ఎయిర్లైన్స్ ఓనర్..

UP కాన్పూర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ నేడు శంఖ్ ఎయిర్లైన్స్కు ఓనర్ అయ్యారు. టెంపో నడుపుతూ చిన్న వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రవణ్.. 2014లో సిమెంట్ ట్రేడింగ్లో సక్సెస్ కావడంతో మైనింగ్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి దిగారు. భారత్లో ప్రారంభం కానున్న 4 కొత్త ఎయిర్లైన్స్లో శంఖ్ ఒకటి. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నారు శ్రవణ్.


