News October 7, 2024

లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

image

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజుజూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శ్రీ లలితా దేవిగా రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని లలిత సహస్రనామాలు పటిస్తున్నారు. నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News April 3, 2026

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మీ అభిప్రాయం ఏంటి..?

image

తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా ఇబ్బందులను పరిష్కరించడం లాంటివి చేపట్టాల్సి ఉంది. మరీ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కొనసాగుతుండగా మీ ప్రాంతంలో సమస్యలను అధికారులు తీర్చారా..?, మీ వద్దకు వచ్చారా..? మీరు ఇందులో భాగమయ్యారా..? కామెంట్ రూపంలో తెలపండి.

News April 3, 2026

HYDలో పెరుగుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

image

హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయని టీజీడీపీఎస్ వెల్లడించింది. దుండిగల్, మౌలాలి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల ధాటికి నగరవాసులు అల్లాడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News April 3, 2026

TG: ఇసుక విక్రయాల ఆదాయంలో భారీ వృద్ధి 

image

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది.  స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.