News October 7, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు GOOD NEWS!

image

TG: గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. తుమ్మల TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి కాల్ చేసి.. తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా, 2023లో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించగా, 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.

Similar News

News March 30, 2026

TU: HIV/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

image

టీయూలో రెడ్ రిబ్బన్ క్లబ్, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) సెల్ ఆధ్వర్యంలో HIV/AIDS పై విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ముఖ్యవక్తగా వచ్చిన డా.మురళీకృష్ణ మాట్లాడుతూ.. HIV/AIDS వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, అపోహలపై వివరించారు. DPM సుధాకర్ మాట్లాడుతూ.. ఏఆర్టీ ద్వారా వైద్యం పొందుతున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు.

News March 30, 2026

US జెట్లకు ఎయిర్ స్పేస్ మూసేసిన స్పెయిన్

image

USకు నాటో దేశం స్పెయిన్ షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తున్న US విమానాలకు గగనతలం మూసేశామని ప్రకటించింది. అలాగే సైనిక స్థావరాల వినియోగానికి వీల్లేదని చెప్పింది. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధంలో పాల్గొనొద్దన్న తమ నిర్ణయంలో ఇదో భాగమని ఆ దేశ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పో వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ గగనతల మూసివేత వర్తించదు.

News March 30, 2026

గోల్డ్ మైన్ వద్ద కాల్పులు.. 70 మంది దుర్మరణం

image

దక్షిణ సూడాన్‌లోని ఓ గోల్డ్ మైన్‌లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. జెబెల్ ఇరాక్‌ ప్రాంతంలోని బంగారు గనులపై ఆధిపత్యం కోసం అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య కొన్నేళ్లుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.