News October 7, 2024

మంత్రి నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్‌ మోకా

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్‌ను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 15, 2026

ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం, డివిజన్, మండల కేంద్రాల్లో ‘PGRS’ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల ప్రస్తుత స్థితి, ఇతర వివరాల కోసం 1100 నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చని ఆమె సూచించారు.

News March 15, 2026

డాక్టర్ గోరంట్లకు నారా భువనేశ్వరి ఘన సత్కారం

image

NTR ట్రస్ట్, GSR మెడికల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో డా.గోరంట్ల రవిరాం కిరణ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. HYDలోని టీడీపీభవన్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. భువనేశ్వరి ఆహ్వానం మేరకు వెళ్లిన డాక్టర్ గోరంట్లను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పేదలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు.

News March 15, 2026

తూ.గో జిల్లాలో YCP కొత్త పరిశీలకుల నియామకం

image

తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు నూతన పరిశీలకులను YCP ఆదివారం నియమించింది. కొవ్వూరుకు గొందేశి శ్రీనివాసరెడ్డి, అనపర్తికి తులసి కుమార్, రాజానగరానికి చందన నాగేశ్వర్, నిడదవోలుకు గిరజాలబాబు, గోపాలపురానికి తోటరామకృష్ణ, రాజమండ్రి సిటీకి అద్దంకి ముక్తేశ్వరరావు నియమితులయ్యారు. ఈ నియామకాల ద్వారా పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత పెరుగుతుందని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.