News October 7, 2024

టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్

image

కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

Similar News

News January 12, 2026

‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

image

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

News January 12, 2026

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా

image

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

News January 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

image

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.