News October 7, 2024

HYDలో కోటికి చేరనున్న వాహనాల సంఖ్య!

image

HYDలో రాబోయే పదేళ్లలో వాహనాల సంఖ్య కోటి దాటనుందని నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఆ స్థాయిలో రోడ్లు విస్తరణకు, నిర్మాణానికి నోచుకోక, ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమిటీకి’ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నడుంబిగించారు. ట్రాఫిక్, ఐటీ విభాగాల అదనపు కమిషనర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.

Similar News

News November 9, 2025

శంషాబాద్: మూడు విమానాలు రద్దు

image

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్‌ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

News November 9, 2025

HYD: ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

image

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.

News November 9, 2025

HYD: వారి జోలికి హైడ్రా వెళ్లదు: రంగనాథ్

image

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.