News October 8, 2024

రేపు HYDకు సమంత.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా?

image

మంత్రి కొండా సురేఖ ఆరోపణల తర్వాత తొలిసారి హీరోయిన్ సమంత రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరుకానున్నారు. దీంతో సమంత ఈ విషయంపై ఏమైనా మాట్లాడతారా? అనేదానిపై చర్చ మొదలైంది. మీడియా ఈ విషయంపై ప్రస్తావిస్తే ఆమె స్పందిస్తారా? లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సమంతతో పాటు రానా, త్రివిక్రమ్ కూడా ఈవెంట్‌లో పాల్గొననున్నారు.

Similar News

News October 8, 2024

శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.

News October 8, 2024

రేపు డబుల్ ధమాకా

image

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రేపు అరగంట వ్యవధిలో రెండు మ్యాచులు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటలకు భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచులో తలపడనుంది. మరోవైపు సా.7.30 గంటలకు మహిళా టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో టీమ్ ఇండియా ఆడనుంది. సెమీస్ చేరాలంటే మహిళల జట్టుకు ఈ మ్యాచులో గెలుపు చాలా కీలకం. కాగా బంగ్లాతో తొలి టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News October 8, 2024

కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ.585 కోట్లు

image

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.