News October 8, 2024
వర్గపోరును ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు: ఈరవత్రి అనిల్

వర్గపోరును ప్రోత్సహిస్తే ఇక నుంచి ఊరుకునేది ప్రసక్తే లేదని, అందరూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయాలనిTGMDC ఛైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. వేల్పూర్ AMC నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు. పదేళ్లుగా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు పదవులు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు.
Similar News
News March 2, 2026
NZB: ఇంటర్ పరీక్షలకు.. 687 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్-1 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. NZB జిల్లా వ్యాప్తంగా 21,473 మంది విద్యార్థులకు 687 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. 18,695 మంది జనరల్ విద్యార్థుల్లో 525 మంది, 2,778 ఒకేషనల్ విద్యార్థులకు 162 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని అధికారులు వివరించారు.
News March 2, 2026
NZB: రేపటి నుంచి వైన్స్ బంద్

హోలీ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ CP సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
News March 2, 2026
NZB: 34 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 34 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు CP చెప్పారు.


