News October 8, 2024
NLG: ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

RTI ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్యర్ల సత్యనారాయణ, సైదులు, మేఖల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2026
నల్గొండ: ఈ ఆలయానిది 200 ఏళ్ల చరిత్ర

చండూరు మండలం తుమ్మలపల్లిలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. కోనేరు వద్ద వెలిసిన లింగాన్ని చూసి రామ్సింగ్, పీత సింగ్ సోదరులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 1895లో రాపోలు సాదుపుల్లయ్య ఇక్కడ శివరాత్రి కళ్యాణ వేడుకలు ప్రారంభించగా, నిజాం ప్రభుత్వం ఆలయానికి 28 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఏ కాలంలోనూ ఎండిపోని ‘పుట్టుగుండం’ ఇక్కడి ప్రత్యేకత.
News March 5, 2026
నల్గొండ: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

NLG జిల్లాలోని 5,38,650 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, రాబోయే CMR సేకరణకు స్థలం కేటాయించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,051 రేషన్ షాపులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 4, 2026
NLG: మహిళలు కనిపిస్తే చాలు.. దూసుకెళ్తున్న బస్సులు!

జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాక కోసం పల్లె ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకైతే బస్సు సౌకర్యమే లేదు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో స్టాప్లలో మహిళలు ఎక్కువగా ఉంటే ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులను డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


