News October 8, 2024
అవనిగడ్డలో జాబ్ మేళా.. రూ.18వేల వరకు వేతనం

అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18- 29 ఏళ్లలోపువారు హాజరు అవ్వొచ్చన్నారు. ఇందులో పలు ప్రముఖ కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఎంపికైన వారికి రూ.10- 18 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని విక్టర్ బాబు చెప్పారు.
Similar News
News January 12, 2026
సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్లను గుర్తించండి: కలెక్టర్

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్లను గుర్తించాలన్నారు.
News January 12, 2026
కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్కు సన్నాహాలు..!

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 4 ఇసుక రీచ్లు ఉన్నాయి. నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంకలో ఉన్న ఇసుక రీచ్లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఘంటసాల మండలం పాపవినాశనంలో మరో రీచ్ను ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 12, 2026
కృష్ణా: రికార్డు స్థాయి పందేం ఇదే.. అందరి నోట ఒక్కటే మాట!

కోడి పందేల చరిత్రలో రికార్డు స్థాయి పందేలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సీసలి బరిలో జరిగిన రూ. 25 లక్షల పందెం ఒక ఎత్తైతే, తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 1.25 కోట్ల పందేం జరగడం పందెం రాయుళ్లను విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రభాకర్ ఈ భారీ పందేంలో నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో పందేలకు క్రేజ్ అమాంతం పెరిగింది.


