News October 8, 2024

ప్రకాశం: కేజీబీవీల్లో 52 నాన్ టీచింగ్ పోస్టులు

image

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 52 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఈఓ డి.సుభద్ర తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18న తుది జాబితా తయారు చేస్తామని, 21న జిల్లా కమిటీ ఆమోదం తర్వాత 22న ఆప్కాస్ ఛైర్మన్‌కు జాబితాను సమర్పిస్తామని అన్నారు.

Similar News

News October 8, 2024

పెద్దారవీడు: పోక్సో కేసులో జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి ఆత్మహత్య

image

పెద్దారవీడు మండలం సిద్ధినాయునిపల్లిలో రుద్రపాటి చిన్న వెంకట చెన్నయ్య (70) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు గతంలో పోక్సో కేసులో జైలుకెళ్లి వచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని పలిశీలించి పంచనామా నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.

News October 8, 2024

రాచర్ల: టానిక్ అనుకొని పేలు మందు తాగి వ్యక్తి మృతి

image

టానిక్ అనుకొని పేలు మందు తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటన రాచర్ల మండలంలో జరిగింది. ఆకివీడుకు చెందిన వెంకటయ్యకు ఆరోగ్యం సరిగాలేదు. ఆ నేపథ్యంలో అతను ..మందులు వాడుతూ ఉంటాడు. కాగా శనివారం గొర్రెలకు పేలు చంపే మందు, టానిక్ ఒకే చోట ఉన్నాయి. సరిగ్గా చూపులేని ఆయన పేలు మంది తాగేసి, అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News October 7, 2024

మార్టూరులో విమానాశ్రయానికి ప్రతిపాదన: MLA ఏలూరి

image

మార్టూరులో విమానాశ్రయం, చినగంజాం మోటుపల్లిలో నౌకాశ్రయానికి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినట్లు పర్చూరు MLA ఏలూరు సాంబశివరావు తెలిపారు. విజన్ 2047రాష్ట్రా అభివృద్ధిలో భాగంగా.. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తులో పలు మౌలిక వసతుల కల్పనకు ఈ డాక్యుమెంటరీ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.