News October 8, 2024

విశాఖ-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 08529, 08530 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు అక్టోబర్ 10 నుంచి 16 వరకు తిరగనున్నాయని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.

Similar News

News March 13, 2025

విశాఖ: పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని సూసైడ్

image

ఫిజిక్స్ పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుంది. సర్క్యూట్ హౌస్ సమీపంలో నివాసముంటున్న ఓ విద్యార్థిని ఫిజిక్స్ పరీక్ష రాసింది. ఇంటికి వచ్చి పరీక్ష బాగా రాయలేదని బాధపడగా ఆమె తల్లి ఓదార్చి నిద్రపోయింది. బుధవారం ఉదయం ఆమె నిద్రలేచి చూసేసరికి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 13, 2025

‘జన్మభూమి’ ఎక్కేవారికి అలర్ట్ 

image

విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)ను సికింద్రాబాద్ వెళ్లకుండా దారి మళ్లించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి విశాఖలో బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట్ వెళ్లకుండా చర్లపల్లి మీదుగా లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 26 నుంచి లింగంపల్లిలో బయలుదేరి సికింద్రాబాద్, బేగం‌పేట్ రాకుండా చర్లపల్లి మీదుగా విశాఖ రానుంది.

News March 13, 2025

విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని వ్యవసాయ మరియు వాణిజ్య శాఖ అధికారులు గురువారం నాడు కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు( రూ/కేజీ)లలో టమాటా రూ.15, ఉల్లిపాయలు రూ.23/28 ,బంగాళాదుంపలు రూ.16, వంకాయలు రూ.34/40/46, బెండకాయలు రూ.46, మిర్చి రూ.28, బరబాటి రూ.36, గోరుచిక్కుడు రూ.36, బీట్రూట్ రూ.20, బీన్స్ రూ.52, కీర రూ.26, దేవుడి చిక్కుడు రూ.64, మునగ రూ.56, అరటికాయలు రూ.38, క్యారెట్ రూ.22/32గా నిర్ణయించారు.

error: Content is protected !!