News October 8, 2024
చిత్తూరు: 365 మంది VRO లు బదిలీ

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 365 మంది వీఆర్వోలను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 1 కేడర్ వీఆర్ఓలను 240 మంది, గ్రేడ్ 2 కేడర్లో 125 మంది మొత్తం 365 మంది వీఆర్ఓలను బదిలీ చేశారు. బదిలీ అయిన వీఆర్ఓలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
చిత్తూరు: 108లో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT), పైలట్(Driver) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయవాడలోని గొల్లపూడి ఏరియా మైనార్టీ కమ్యూనిటీ హాల్లో శని ఆదివారం సెలక్షన్స్ నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూకు హాజరు కావాలని జిల్లా మేనేజర్ మోహన్ బాబు, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జగదీశ్ కోరారు.
News March 14, 2026
పూతలపట్టు ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్పై నమోదైన కేసును చిత్తూరు జిల్లా ఫస్ట్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. యాదమరి మండలం కాశిరాళ్ల వద్ద 2023లో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో యాదమరి పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు ఇతర నాయకులపై నమోదైన కేసును రద్దు చేసింది.
News March 13, 2026
చిత్తూరు: ముగ్గరికి రెండేళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారు. నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు.


