News October 8, 2024
డిసెంబర్లో విశాఖ రైల్వేజోన్కు శంకుస్థాపన..!

కేంద్ర రైల్వే మంత్రి, సీఎం చంద్రబాబు భేటీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబరు కల్లా కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలో భాగంగా వాల్తేరు డివిజన్ను యథావిధిగా ఉంచాలని కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ-అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటు, నమోభారత్ కింద విశాఖ-నెల్లూరు మధ్య రైలు అనుసంధానం మెరుగుపరచాలని కోరారు.
Similar News
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.
News March 6, 2026
స్టడీ టూర్కు పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్లు

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కనీసం ఒక్కసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్ను కోరుతున్నారు. ఐదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మాత్రమే యాత్రలు జరిగాయని, ఒక సంవత్సరం మిగిలిపోయిందని వారు చెబుతున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


