News October 8, 2024

వాకాడు: టీడీపీ నేత సంచలన ప్రకటన

image

వాకాడు మండలం రాగుంటపాలెం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన వాకాడు మండల టీడీపీ బీసీ సెల్ నాయకుడు చెన్నపట్నం జమిందార్ బాబు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన నాయకులను టీడీపీలో చేర్చుకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దన్నారు.

Similar News

News January 11, 2026

నెల్లూరు: 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

image

నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల వరకు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

News January 11, 2026

రాష్ట్రంలో నెల్లూరుకు మొదటి స్థానం

image

జిల్లా మ్యూజియంకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కిన్నట్లు మ్యూజియం ఇన్‌ఛార్జ్ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 5 జిల్లా సైన్స్ మ్యూజియం కేంద్రాలు ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు సైన్స్ మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు – 10 వేలు, కడప – 854, ఏలూరు – 3,540, చిత్తూరు – 4,000, అనంతపురం – 5,636 మంది సందర్శించారు.

News January 11, 2026

నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

image

నెల్లూరు సెంటర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్షణ అనుభవించి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ సైదులు సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.