News October 8, 2024

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్‌లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. దీనికోసం భక్తులు sabarimalaonline.org వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPతో ఖాతా ధ్రువీకరించి దర్శనానికి వెళ్లే రోజును ఎంచుకుని సబ్మిట్ కొడితే వర్చువల్ క్యూ టికెట్ వస్తుంది. రోజుకు 80వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు.

Similar News

News March 25, 2026

రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

image

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.

News March 25, 2026

రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News March 25, 2026

ఈసారి సిక్సర్ల వీరుడు ఎవరో?

image

ఈసారి IPLలో సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. ముఖ్యంగా SRHలోని హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్ విరుచుకుపడతారని తెలిపారు. వారితో పాటు శాంసన్ (CSK), అలెన్ (KKR), పూరన్ (LSG), రోహిత్ శర్మ (MI), శివమ్ దూబే (CSK), వైభవ్ సూర్యవంశీ (RR), బ్రెవిస్ (CSK) ఈ రేసులో ముందున్నారు. మరి ఈ సీజన్లో ఎవరు అత్యధిక సిక్సర్లు కొడతారో కామెంట్ చేయండి.