News October 8, 2024

విచిత్రం: సీట్లు తగ్గాయ్.. కానీ ఓట్లు పెరిగాయి

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సీట్ల ఆధిక్యంలో వెనుకబడిన కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం ముందుంది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం మ.12.15 గంటల సమయానికి కాంగ్రెస్ 40.25 శాతం, బీజేపీ 39.29 శాతం ఓట్లను సాధించాయి. అయితే బీజేపీ 49 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమైంది.

Similar News

News March 6, 2026

కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

image

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

News March 6, 2026

కేజీ వెండిపై రూ.5వేలు తగ్గుదల

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>>తో పాటు ఇవాళ వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,90,000 పలుకుతోంది. గత 6 రోజుల్లో కేజీ వెండిపై రూ.35వేలు తగ్గుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 6, 2026

తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

image

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.