News October 8, 2024
వరంగల్ మార్కెట్కు వరుస సెలవులు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News October 8, 2024
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6100 ధర పలకగా, పచ్చి పల్లికాయ ధర రూ.4,000 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ. 14వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా ఫలితాలను గత వారంతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు రైతులు పేర్కొన్నారు.
News October 8, 2024
గౌరవ వందనం స్వీకరించిన మంత్రి కొండా సురేఖ
జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కొండా సురేఖకు స్థానిక కలెక్టర్ సంతోశ్, ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ చర్చించారు.
News October 8, 2024
మహాకాళి అవతారంలో గంభీరంగా దర్శనమిస్తున్న అమ్మవారు
వరంగల్ నగరవ్యాప్తంగా శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన దుర్గాదేవి ప్రతిమలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ బట్టల బజార్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు భక్తులు తరలివస్తున్నారు. మహాకాళి అవతారంలో గంభీరంగా కనిపిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.