News October 8, 2024
జగన్.. రూ.కోటి సాయం ఎవరికిచ్చారో చెప్పాలి: బుద్దా

AP: వరదల సమయంలో ప్రజలను చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. వరదలను అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారంటూ YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వరదలప్పుడు ఏసీ గదిలో కూర్చున్న జగన్ ఇప్పుడు పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రకటించిన రూ.కోటి సాయం ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.
Similar News
News March 6, 2025
భాగస్వామితో కలిసి నిద్రిస్తే కలిగే ప్రయోజనాలివే..!

భార్యాభర్తలు కలిసి <<15666785>>నిద్రించడం<<>> వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్సవ్వడం, ప్రెజర్స్, టార్గెట్స్, వేధించే ఒంటరితనానికి ఇదే అసలైన ఔషధం అంటున్నారు. లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదలై డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతాయని, ఆయు: ప్రమాణం, బంధంపై సంతృప్తి పెరుగుతాయని చెప్తున్నారు. భాగస్వామి నుంచి ప్రేమ, కంఫర్ట్, రిలాక్స్, హ్యాపీ, ప్రశాంతతను ఫీలవుతారన్నారు.
News March 6, 2025
రాష్ట్ర సమస్యలపై గళమెత్తండి: ఎంపీలతో జగన్

AP: రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలని, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలని, దానిపై కేంద్రం స్పందించేలా చొరవ చూపాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారికి జగన్ దిశానిర్దేశం చేశారు.
News March 6, 2025
తల్లి కాబోతున్న వినేశ్ ఫొగట్

భారత మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ‘మా లవ్ స్టోరీ కొత్త చాప్టర్తో కొనసాగనుంది’ అని తన భర్త సోంవీర్ రథీతో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 2024లో ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన ఫొగట్ అధిక బరువు కారణంగా గోల్డ్ మెడల్ సాధించలేకపోయారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు.