News October 8, 2024
సచివాలయ ఉద్యోగులను వేధించడం దారుణం: మజ్జి శ్రీనివాసరావు

సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తన ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయన్నారు. విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతూ వేధించడం దారుణమన్నారు. ఉద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.
Similar News
News March 11, 2026
దువ్వాడ-విశాఖ-విజయనగరం రైల్వే లైన్ అప్గ్రేడ్కు గ్రీన్ సిగ్నల్

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని 106 కి.మీ.ల దువ్వాడ-విశాఖ-VZM సెక్షన్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అప్గ్రేడ్కు రైల్వే శాఖ రూ.318.07 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 1×25 KV వ్యవస్థను ఆధునిక 2×25 KVగా మార్చనున్నారు. దీంతో విద్యుత్ సరఫరా పెరిగి రైళ్ల వేగం, సరకు రవాణా సామర్థ్యం మెరుగుపడనుంది. హౌరా-చెన్నై మార్గంలో ఉన్న ఈ సెక్షన్ ద్వారా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి ఖనిజాలు విశాఖ పోర్టుకు తరలిస్తారు.
News March 11, 2026
విజయనగరం: పోస్టల్ బీమాతో రూ.15 లక్షల ఆర్థిక సాయం

పోస్ట్ ఆఫీసు యాక్సిడెంటల్ పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని విజయనగరం పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు అన్నారు. మంగళవారం దత్తిరాజేరులో ప్రమాదవశాత్తు మృతి చెందిన మర్రివలస గ్రామస్థుడు కోరాడ లక్ష్మణ్ రావు కుటుంబానికి రూ.15 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అధికారులు కోరారు.
News March 10, 2026
విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.


