News October 8, 2024

సచివాలయ ఉద్యోగులను వేధించడం దారుణం: మజ్జి శ్రీనివాసరావు

image

సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయన్నారు. విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతూ వేధించడం దారుణమన్నారు. ఉద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.

Similar News

News September 19, 2025

భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

image

భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, జాతీయ ర‌హ‌దారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై క‌లెక్ట‌రేట్లో సంబంధిత అధికారుల‌తో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం స‌మీక్షా నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిఎంఆర్‌కు అప్ప‌గించిన 2,200 ఎక‌రాల భూముల ప‌రిస్థితి, వాటికి సంబంధించిన స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. విమాన‌యాన అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎక‌రాల భూములపై ఆరా తీశారు.

News September 18, 2025

VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

image

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 18, 2025

పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

image

సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.