News October 8, 2024

హార్దిక్ పాండ్య సరికొత్త ఘనత

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సరికొత్త ఘనత సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన ప్లేయర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు ఆయన 5 సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేశారు. విరాట్ కోహ్లీ, ఫించ్, ఇయాన్ మోర్గాన్, తిసారా పెరీరా, రస్సెల్, షాయ్ హోప్ నాలుగేసి సార్లు సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించారు. కాగా ఈ ఏడాది హార్దిక్ టీ20ల్లో 214 పరుగులతోపాటు 14 వికెట్లు కూడా తీశారు.

Similar News

News March 20, 2026

శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

image

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.

News March 20, 2026

ఇంటి పనులను భర్త షేర్ చేసుకోవాలి: సుప్రీంకోర్టు

image

తన భార్యకు వంట సహా ఇంటి పనులు సరిగ్గా చేయడం రాదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలం మారిందని, ఇంటి పనులను భర్త కూడా షేర్ చేసుకోవాలని పేర్కొంది. ‘మీరు పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని తెలిపింది. తన పేరెంట్స్‌కు ఆహారం పెట్టడానికి ఆమె నిరాకరించిందని భర్త కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

News March 20, 2026

‘ఎక్కడ ఉన్నా చంపేస్తాం’.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

image

అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, సైనికులకు ఇరాన్ IRGC స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ప్రపంచంలో మీకు ఏ ప్రాంతం సురక్షితం కాదు. రిసార్టులు, టూరిస్టు ప్లేసులు ఇలా మీరు ఎక్కడ ఉన్నా చంపేస్తాం’ అని హెచ్చరించింది. కాగా ఇరాన్ ప్రతినిధులను వరుసగా చంపేస్తుండటంతో IRGC ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
*ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి అప్‌డేట్‌లో ఉండండి.