News October 8, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6100 ధర పలకగా, పచ్చి పల్లికాయ ధర రూ.4,000 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ. 14వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా ఫలితాలను గత వారంతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు రైతులు పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

WGL: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరుగుదల

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతింటుందనే ఆందోళనతో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరిలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్‌లు ఉండగా, శుక్రవారం ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదయ్యాయి. దీంతో అత్యవసరంగా అవసరమైన వారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి. సరఫరాలో అంతరాయం లేదని, అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని అధికారులు తెలిపారు.

News March 14, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.

News March 13, 2026

మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

image

SIR మ్యాపింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (RDO)ను కలెక్టర్ ఆదేశించారు.