News October 9, 2024

తూ.గో జిల్లాలో TODAY TOP NEWS

image

➣ తూ.గో. పుష్కరాలకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు
➣ ఎమ్మెల్యేలు దోచుకునేందుకే కొత్త మద్యం పాలసీ: భరత్
➣ తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు..
➣ పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం
➣ చేనేత పరిశ్రమ అభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎంపీ తంగేళ్ల
➣ పిఠాపురం బాలిక అత్యాచార నిందితుడిపై పోక్సో కేసు

Similar News

News August 21, 2025

భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

image

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.

News August 21, 2025

రాజమండ్రి: ఈవీఎంల గోడౌన్‌ తనిఖీ

image

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించారు. గురువారం ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, తహశీల్దార్ పాపారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.

News August 21, 2025

రాజమండ్రి: 106 కుటుంబాలకు పునరావాస కేంద్రంలో ఆశ్రయం

image

గోదావరి వరదల కారణంగా రాజమండ్రిలోని ఏసీ గార్డెన్స్ ఎంపీఎల్ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం తెలిపారు. మొత్తం 106 కుటుంబాలకు ఆశ్రయం కల్పించామని వారిలో పురుషులు 110, మహిళలు 111, పిల్లలు 72 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఆర్డీవో, తహశీల్దార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందన్నారు.