News October 9, 2024
మా రికార్డు భారత్కు దరిదాపుల్లో కూడా లేదు: మోర్గాన్

టీమ్ ఇండియా పోరాట స్ఫూర్తిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించారు. భారత్ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తే BGTలో ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవన్నారు. ‘స్వదేశ పరిస్థితుల్లో భారత్ను కొట్టడం దాదాపు ఆసాధ్యం. గెలవాలన్న పట్టుదలే వారిని పటిష్ఠంగా మార్చింది. మా దేశంలోనూ స్వదేశ పరిస్థితులు మాకు అనుకూలమే. కానీ మా తరతరాల రికార్డు తీసుకున్నా భారత్కు కనీసం దరిదాపుల్లో లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
జనగణన.. పౌరులే వివరాలు సమర్పించే అవకాశం

దేశ వ్యాప్తంగా చేపట్టే జన, కులగణనలో పౌరులే నేరుగా తమ వివరాలు సమర్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కల్పించనుంది. ఇందుకోసం త్వరలోనే ఓ వెబ్సైటును అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 2026 ఏప్రిల్ 1న ఇళ్ల వివరాలతో కూడిన జాబితా, ఆ తర్వాత 2027 ఫిబ్రవరి 1 నుంచి జనగణనను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. ఇదే సమయంలో కులగణననూ చేపడతారు. ఈ రెండు విడతల్లోనూ ప్రజలు తమ వివరాలు పోర్టల్లో నమోదు చేయవచ్చు.
News July 8, 2025
నన్ను కూడా చంపేవారు: నల్లపురెడ్డి

AP: నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి <<16984961>>ఘటనపై <<>>వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. ‘నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయం చేస్తారని అనుకోలేదు. నేను, నా కొడుకు బయటకెళ్లాక దాడి చేశారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారు. ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవారు’ అని ఆరోపించారు.
News July 8, 2025
తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో జంప్!

AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.