News October 9, 2024
14 నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Similar News
News October 21, 2025
మిమ్మల్ని చిత్తూరు ప్రజలు మరవలేరు..!

2020 నవంబర్ 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఐరాల(M) రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. 2007లో చిత్తూరులో CKబాబుపై జరిగిన హత్యాయత్నంలో గన్మెన్స్ హుస్సేన్ బాషా, సురేంద్ర అమరులయ్యారు. 2017లో పలమనేరు అడవుల్లో మహిళను అత్యాచారం చేయబోయారు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డు దేవంద్ర చనిపోయారు.
#నేడు అమరవీరుల దినోత్సవం
News October 20, 2025
చిత్తూరులో PGRS రద్దు

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.
News October 20, 2025
ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.