News October 9, 2024
కోహ్లీ రికార్డుకు దగ్గర్లో సూర్య

బంగ్లాదేశ్తో టీమ్ఇండియా ఈరోజు రెండో టీ20 ఆడనుంది. ఈమ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును సమం చేయవచ్చు. అత్యంత తక్కువ T20 మ్యాచుల్లో 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ నిలిచారు. విరాట్ 73 మ్యాచుల్లో 2500 పరుగుల మార్క్ను దాటారు. SKY 72 మ్యాచుల్లో 2461 రన్స్ చేశారు. పాక్ బ్యాటర్ బాబర్ 67 మ్యాచుల్లోనే 2500రన్స్ చేసి ప్రథమ స్థానంలో ఉన్నారు.
Similar News
News July 8, 2025
జైలులో కాకాణికి తోడుగా ఉంటా: ప్రసన్న కుమార్ రెడ్డి

AP: TDP MLA <<16988626>>వేమిరెడ్డి ప్రశాంతి<<>>పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News July 8, 2025
సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.
News July 8, 2025
ఇంటర్నెట్ లేకుండా పనిచేసే మెసేజింగ్ యాప్!

ట్విటర్ మాజీ CEO జాక్ డోర్సే సరికొత్త మెసేజింగ్ యాప్ను రూపొందించారు. ‘బిట్చాట్’ పేరుతో రూపొందిన ఈ యాప్కు ఇంటర్నెట్, ఫోన్ నంబర్లు, సర్వర్లు అవసరం లేదు. కేవలం బ్లూటూత్ నెట్వర్క్లలో పనిచేసే పీర్-టు-పీర్ మెసేజింగ్ యాప్ ఇది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. బిట్చాట్ అనేది గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే, ఆఫ్-గ్రిడ్ కమ్యూనికేషన్ కోసం రూపొందించినదని జాక్ చెబుతున్నారు.