News October 9, 2024
హరియాణాలో ఓడిన స్పీకర్, 8 మంది BJP మంత్రులు

హరియాణాలో వరుసగా మూడోసారి BJP గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత క్యాబినెట్లోని 10 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా కూడా ఓడిపోయారు. దీంతో అక్కడ మంత్రివర్గంలోకి కొత్తముఖాలు కనిపించనున్నాయి.
Similar News
News March 7, 2025
నీట్-UG దరఖాస్తుకు నేడే లాస్ట్

2025-26 విద్యాసంవత్సరానికి గాను MBBS, BDS, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-UG దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఉంటుంది. మే 4న దేశవ్యాప్తంగా మ.2 గంటల నుంచి సా.5 వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్సైట్: https://examinationservices.nic.in/
News March 7, 2025
నేడు మంత్రివర్గ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
News March 7, 2025
గాజా నుంచి పారిపోండి: హమాస్కు ట్రంప్ అల్టిమేటం

బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్పై ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెల్కు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి’ అని ఫైర్ అయ్యారు.