News October 9, 2024
హెవీవెయిట్స్ అండతో స్టాక్మార్కెట్ల జోరు
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. Infy, ICICI, SBI, Airtel వంటి హెవీవెయిట్స్ సూచీలకు అండగా నిలిచాయి. ప్రీమార్కెట్లో 25,300ను టచ్ చేసిన నిఫ్టీ ప్రస్తుతం 73 పాయింట్ల లాభంతో 25,086 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 235 పాయింట్లు ఎగిసి 81,854 వద్ద చలిస్తోంది. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, Trent, బజాజ్ ఫైనాన్స్, TECH M టాప్ గెయినర్స్. ONGC, ITC, బ్రిటానియా, నెస్లే, HUL టాప్ లూజర్స్.
Similar News
News October 9, 2024
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్’లో చివరగా నటించారు.
News October 9, 2024
హరియాణాలో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాం: కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే హరియాణాలో ఓడిపోయామని కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేశ్ అంగీకరించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ అంతర్గత యంత్రాంగం అలసత్వమే కొంప ముంచిందన్నారు. తమ అతిపెద్ద బలహీనత ఇదేనన్నారు. హైకమాండ్ త్వరలోనే దీనిపై సమీక్షిస్తుందని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు NC, కాంగ్రెస్ కూటమికి చక్కని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తమ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
News October 9, 2024
నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్
AP: విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీనిచ్చారు.