News October 9, 2024
చిట్టినాయుడి ప్రజా పాలన మాటలకే పరిమితం: BRS
TG: రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. చిట్టినాయుడి ప్రజా పాలన కేవలం మాటలకే పరిమితమైందని, మూడు నెలలు గడిచినా పంచాయతీ కార్మికులకు జీతాలు అందలేదని పేర్కొంది. జీతాలు రాక తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అంటూ వాళ్లు నిరసన చేపడుతున్నారని ట్వీట్ చేసింది. ఈ ప్రభుత్వం పండుగలకు కార్మికులను పస్తులు ఉంచుతోందని మండిపడింది.
Similar News
News October 9, 2024
ENGvsPAK: రూట్ సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ పాక్పై సెంచరీతో చెలరేగారు. ముల్తాన్లో జరుగుతోన్న టెస్టు మ్యాచులో ఆయన తన 35వ టెస్టు సెంచరీని పూర్తిచేసుకున్నారు. దీంతో అన్ని ఫార్మాట్లలో రూట్ 51 సెంచరీలు పూర్తిచేసుకున్నారు. అలాగే అత్యధిక సెంచరీలు చేసిన రెండో యాక్టివ్ ప్లేయర్గా నిలిచారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (48), కేన్ (45), స్మిత్ (44) ఉన్నారు.
News October 9, 2024
రిచెస్ట్ నటి.. ఆమె ఆస్తి రూ.66వేల కోట్లు!
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నటుడిగా $1.4 బిలియన్లతో టైలర్ పెర్రీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకంటే కూడా సినీరంగంలో మోస్ట్ రిచెస్ట్ నటి ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. అమెరికన్ నటి జామీ గెర్ట్జ్ ప్రపంచంలోనే ధనవంతురాలని పేర్కొంది. గెర్ట్జ్ నికర విలువ $8 బిలియన్లు ( ₹ 66,000+ కోట్లు). ఆ తర్వాతి స్థానాల్లో టేలర్ స్విఫ్ట్ ($1.6 బిలియన్), రిహన్నా ($1.4 బిలియన్), సెలెనా గోమెజ్ ($1.3 బిలియన్) ఉన్నారు.
News October 9, 2024
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్’లో చివరగా నటించారు.