News October 9, 2024
రూ.కోట్లల్లో మూవీ స్టార్స్ మేనేజర్స్ సంపాదన

సినీతారల డేట్స్, ప్రమోషన్స్, బిజినెస్ చూసేందుకు వారికి మేనేజర్స్ ఉంటారనే విషయం తెలిసిందే. స్టార్స్ ఎదుగుదలలో కీలకంగా ఉండే మేనేజర్లకు కూడా భారీగా జీతాలుంటాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఏడాదికి రూ.7-9 కోట్లు, అంజుల ఆచార్య (ప్రియాంక చోప్రా) రూ.6కోట్లు సంపాదిస్తున్నారు. గతంలో పూనమ్(కరీనా) రూ.3 కోట్లు, సుసాన్(రణ్వీర్ సింగ్) రూ.2కోట్లు ఛార్జ్ చేసేవారు’ అని తెలిపాయి.
Similar News
News January 7, 2026
మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో కానున్న నాగార్జున!

రా కార్తీక్ డైరెక్షన్లో సినీ హీరో నాగార్జున 100వ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీని నాగార్జునకు కలిసొచ్చిన డేట్ మే 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘విక్రమ్’, ‘మనం’ ఇదే తేదీన రిలీజై విక్టరీ కొట్టాయి. తాజా సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్ను ఫాలో కానున్నారని టాక్. ఈ చిత్రానికి ‘100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
News January 7, 2026
డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.
News January 7, 2026
ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ‘అలా చేస్తే కడుపులోని జీర్ణ రసాలు పలుచబడతాయి. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటి అధిక పరిమాణం కడుపులో ఒత్తిడిని పెంచి, ఆహారాన్ని అరిగించాల్సిన యాసిడ్ను అన్నవాహికలోకి నెడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత 30-60 నిమిషాలు ఆగి వాటర్ తాగాలి’ అని సూచిస్తున్నారు.


