News October 9, 2024
వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదు: మంత్రి అనిత

AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
Similar News
News February 13, 2026
పూత, పిందె దశలో మామిడి పంటకు నీరు ఎలా ఇవ్వాలి?

మామిడి తోటలోని చెట్లు అన్నింటికీ పూ మొగ్గలు వచ్చినప్పుడు తోటకు తేలికగా నీరు పెట్టాలి. పిందెలు ఏర్పడ్డాక మామిడి చెట్లకు వీలును బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 తడుల నీటిని అందించాలి. దీని వల్ల పిందెలు రాలడం తగ్గి కాయలు పెద్దవిగా నాణ్యంగా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అవసరానికి మించి చెట్లకు నీరు పెట్టడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 13, 2026
350 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 13, 2026
శివుడు లింగాకారంలో ఎందుకు?

శివుడు లింగాకారంలో పూజలందుకుంటాడు. అందుకు పురాణాలు 2 కారణాలు చెబుతున్నాయి. వరాహ పురాణం ప్రకారం.. భృగు మహర్షి శాపం వల్ల శివుడు విగ్రహ రూపం వదిలి లింగాకారంలో పూజలందుకుంటున్నాడు. అయితే తాత్విక కోణంలో ‘లింగం’ అంటే ఓ ‘గుర్తు’ లేదా ‘సంకేతం’. నిరాకారుడు, అనంతమైన శూన్య స్వరూపుడైన పరమాత్మను ఆరాధించడానికి శివలింగం ఓ పవిత్ర చిహ్నం. అందుకే రూపం లేని ఆ పరమేశ్వరుడిని భక్తులు లింగరూపంలో కొలుస్తారు.


