News October 9, 2024
J&Kలో కిడ్నాప్నకు గురైన జవాన్ మృతదేహం లభ్యం

జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ అటవీ ప్రాంతంలో కిడ్నాప్నకు గురైన జవాన్ మృతిచెందారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు నిన్న కిడ్నాప్ చేయగా, ఒక జవాన్ చాకచక్యంగా తప్పించుకున్నారు. మరో జవాన్ కోసం భద్రతా బలగాలు గాలించగా, తాజాగా మృతదేహం లభ్యమైంది.
Similar News
News March 9, 2025
గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.
News March 9, 2025
ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రూ.11 వేల కోట్లు

TG: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను విద్యాశాఖ అనుబంధ సంస్థ టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో ఒక్కో క్యాంపస్ చొప్పున రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. ముందుగా కొడంగల్, మధిర, హుజుర్ నగర్లో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నారు.
News March 9, 2025
త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.