News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.
Similar News
News November 4, 2025
ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. <<-se>>#haircare<<>>
News November 4, 2025
పాపం.. చేయని తప్పుకు 43 ఏళ్లు జైలులోనే!

‘వందమంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అని చెబుతుంటారు. కానీ చేయని తప్పుకు 43ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు USలోని భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదం. 1980లో హత్య కేసులో జైలుపాలైన ఆయన ఇటీవలే నిర్దోషిగా రిలీజయ్యారు. అయితే దశాబ్దాల పాత డ్రగ్స్ కేసులో ఇమిగ్రేషన్ అధికారులు మళ్లీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో కోర్టు జోక్యం చేసుకుంది. ఈ కేసును నిలిపివేసి ఆయనకు తాత్కాలిక ఊరటనిచ్చింది.
News November 4, 2025
వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి ఎలా చేయాలి?

☛వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి.
☛ మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు. 


