News October 9, 2024
టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు

AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 28, 2025
VHTలో ఆడనున్న శ్రేయస్ అయ్యర్!

గాయం కారణంగా టీమ్కు దూరమైన వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అతను పూర్తిగా కోలుకున్నట్లు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లోని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ముంబై తరఫున జనవరి 3, 6న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటారని, తర్వాత న్యూజిలాండ్ సిరీస్కు అందుబాటులోకి వస్తారని సమాచారం. OCT 25న AUSతో మ్యాచ్లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే.
News December 28, 2025
డ్రెస్సింగ్పై నిధి అగర్వాల్ ఏమన్నారంటే?

హీరోయిన్ నిధి అగర్వాల్ #ASKNIDHI అంటూ ట్విట్టర్లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా ఒకరు ‘ఏ కాస్ట్యూమ్/అవుట్ ఫిట్ ధరించడం మీకు ఇష్టం?’ అని అడిగారు. అందుకు ‘నన్, ఏంజెల్ కాస్ట్యూమ్ ఇష్టం’ అంటూ నిధి చెప్పారు. ఆమె రాజాసాబ్ చిత్రంలో నన్గా కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్స్ వస్త్రధారణపై జరుగుతున్న చర్చలో <<18661197>>నిధి<<>> పేరు హైలైట్ కావడంతో ఆమె ఇచ్చిన ఆన్సర్ SMలో వైరలవుతోంది.
News December 28, 2025
వైద్యం అందక భారత సంతతి వ్యక్తి మృతి.. మస్క్ ఆగ్రహం

కెనడాలో సరైన చికిత్స అందక భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్(44) మృతి చెందడంపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్కు వెళ్లిన ప్రశాంత్ను 8 గంటలపాటు వెయిట్ చేయించారు. దీంతో కెనడా హెల్త్కేర్ సిస్టంను US మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్తో పోల్చుతూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.


