News October 9, 2024

రోహిత్ వల్లే గెలిచాం.. గంభీర్‌ను పొగడటం ఆపండి: గవాస్కర్

image

బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను భారత్ అద్భుత రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. దానిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రోహిత్ కెప్టెన్సీ వల్లే ఆ గెలుపు సాధ్యమైందని తేల్చిచెప్పారు. కొంతమంది ఆ క్రెడిట్‌ను గంభీర్‌కు కట్టబెట్టి అతడి బూట్లు నాకుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ వర్గాల్లో ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి.

Similar News

News January 12, 2026

సంగారెడ్డి: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి’

image

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

News January 12, 2026

జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత

image

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.

News January 12, 2026

శాంసంగ్‌కు చెక్.. టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్

image

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్‌గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్‌లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్‌లోకి వచ్చింది. శాంసంగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.