News October 10, 2024

నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం

image

AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News October 10, 2024

TATA: పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం..!

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి మరో బలమైన కారణం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తన చిన్నప్పుడే తండ్రి నావల్ టాటా నుంచి తల్లి సోనో విడిపోయారు. తన నానమ్మ నవాజ్ బాయ్ వద్దే ఆయన పెరిగారు. కొంతకాలానికి ఆయన తల్లి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై టాటాను స్కూళ్లో తోటి విద్యార్థులు అవహేళన చేసేవారు. ఆ అవమానాలే ఆయన వివాహం చేసుకునేందుకు అడ్డు వచ్చాయని అంటారు.

News October 10, 2024

నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!

image

దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా లాహర్ నగర్‌లో రతన్‌గఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
– ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.

News October 10, 2024

రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ

image

రితీశ్ రాణా దర్శకత్వంలో సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం రేపు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘మత్తు వదలరా’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.