News October 10, 2024
దుర్గాదేవి అలంకారంలో జగన్మాత

AP: దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై జగన్మాత నేడు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దుర్గముడనే రాక్షసుడ్ని సంహారం చేసిన శక్తి స్వరూపిణే దుర్గాదేవి. ఈరోజు అమ్మను దర్శించుకుంటే గ్రహ బాధలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు సిబ్బంది అన్నపానీయాలు అందిస్తున్నారు.
Similar News
News January 31, 2026
నేడు వనప్రవేశం.. ముగియనున్న మేడారం మహాజాతర

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన వనప్రవేశం నేడు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య బృందం గద్దెల వద్ద రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తంతు ముగించి, తల్లి రూపమైన కుంకుమ భరిణెను తీసుకుని పూజారులు చిలుకలగుట్టకు బయలుదేరుతారు. దీంతో నాలుగు రోజుల పాటు వైభవంగా సాగిన గిరిజన కుంభమేళాకు తెరపడనుంది.
News January 31, 2026
నేడు శని త్రయోదశి.. సాయంత్రం ఇలా చేయండి!

శనైశ్చరుడు విష్ణు భక్తుడు కావడంతో మాఘమాసంలో వచ్చే శని త్రయోదశిని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈరోజు చేసే పరిహారాలు, దానాలు రెట్టింపు ఫలితాన్ని అందిస్తాయని పండితుల మాట. ‘సా.5.15-5.45 గంటల మధ్య శివునికి అభిషేకం చేస్తే శని పీడల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే పడమర దిక్కున నువ్వుల నూనెతో 8 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించుకోండి’ అని చెబుతున్నారు.
News January 31, 2026
కోళ్లలో ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు

కోళ్ల పెంపకంలో అతి ప్రధాన సమస్య వ్యాధులు రావడం. వీటిని సకాలంలో గుర్తించి, నివారించకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కోళ్లలో అతి ప్రమాదకరమైనది కొక్కెర వ్యాధి. దీంతోపాటు కొరైజా, అమ్మోరు/మశూచి, పుల్లొరం, తెల్లపారుడు వ్యాధులు పెంపకందారులకు, ఫౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిని కోళ్లలో ఎలా గుర్తించాలి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


