News October 10, 2024

కడప: నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. ముగ్గురిపై కేసు

image

కడప జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న హెడ్ కానిస్టుబుల్‌తో సహా ముగ్గురిపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కాయపల్లెలో 15సెంట్ల స్థలానికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ బాషాతో పాటు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి నెల్లూరుకు చెందిన శివకృష్ణ అనే వ్యక్తిని బెదిరించడంతో అతడు ఫిర్యాదు చేశాడు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అవ్వడంతో కేసులు నమోదు చేస్తున్నారు.

Similar News

News January 9, 2026

కడప: సీట్‌లో కూర్చోకముందే ఆ SIలకు మళ్లీ ట్రాన్స్‌ఫర్

image

మూడు రోజులక్రితం కడప జిల్లాలో 18 మంది SIలు ట్రాన్స్‌ఫర్ అయిన విషయం తెలిసిందే. వారు బదిలీ అయిన స్టేషన్‌లో రిపోర్ట్ చేయకమునుపే వారిలో కొందరిని మళ్లీ బదిలీ చేశారు. మొదట ప్రొద్దుటూరు రూరల్ స్టేషన్ SIగా అరుణ్‌రెడ్డిని మైదుకూరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన అక్కడ సీట్‌లో కూర్చోకమునుపే కడప వీఆర్‌కి బదిలీ అయ్యారు. బద్వేల్ నుంచి శ్రీకాంత్‌ను మొదట ప్రొద్దుటూరు 1-టౌన్, ఇప్పుడు రూరల్‌కు బదిలీ చేశారు.

News January 9, 2026

గండికోట ఉత్సవాలు.. నేడు కడపలో బైక్ ర్యాలీ

image

గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. రాజీవ్ మార్క్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్, ఎర్రముక్కపల్లి సర్కిల్, ఐటీఐ బిల్ట్ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, అల్మాస్పేట్ మాసాపేట సర్కిల్, అన్నమయ్య సర్కిల్, అప్సర హాల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతుంది.

News January 8, 2026

ఒంటిమిట్ట: అమ్మమ్మను కత్తితో పొడిచాడు..!

image

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాఘవమ్మ(70) పొలంలో పనిచేస్తుండగా ఆమె మనవడు నంద(20) కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతేనే దాడి చేసినట్లు సమాచారం. నంద తల్లి కువైట్‌లో ఉండగా.. ప్రస్తుతం అతను అమ్మమ్మ రాఘవమ్మ దగ్గర ఉంటున్నాడు.