News October 10, 2024
రైల్వేకోడూరు: రేబీస్ వ్యాధితో మహిళ మృతి

ఉమ్మడి కడప జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. రైల్వే కోడూరు మండలం ఎ.బుడగుంటపల్లి పంచాయతీ వికాస్ నగర్కు చెందిన పులికి మునిలక్ష్మి(35)ని ఆమె పెంచుకున్న పెంపుడు కుక్క కాటేసింది. ఈక్రమంలో ఆమెకు రేబీస్ వ్యాధి సోకింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంపుడు, వీధి కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.
Similar News
News March 10, 2026
కడప జిల్లాలోని మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

కడప కార్పొరేషన్ సహా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో 284 జారీ చేసింది. కడపకు కలెక్టర్, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్, మిగతా ఐదు పట్టణాలకు ఆర్డీవోలు స్పెషల్ ఆఫీసర్లుగా ఆరు నెలల పాటు విధుల్లో ఉండనున్నారు.
News March 10, 2026
కడప: ఇంటర్ పిజిక్స్ పరీక్షలకు 13,755 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో మంగళవారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ పిజిక్స్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 13,755(96%) మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 13,131 మందికి గాను.. 12,741 మంది హాజరయ్యారు. 390 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,210 మందికి గాను.. 1,014 మంది పరీక్షలు రాశారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
News March 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,950
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,674
*వెండి 10 గ్రాముల ధర రూ.2,750


