News October 11, 2024
CARTOON: స్వర్గంలో టాటాకు జంషెట్జీ స్వాగతం
రతన్ టాటాకు స్వర్గంలో తన ముత్తాత జంషెట్జీ, భారతరత్న జేఆర్డీ టాటా స్వాగతం పలుకుతారేమో. తాము నాటిన మొక్కను దశదిశలా వ్యాపింపజేసినందుకు ఆయన్ను అభినందిస్తారేమో. ‘నేను గర్వపడేలా చేశావు’ అని జంషెట్జీ చెబుతుండగా, జేఆర్డీ మురిసిపోతున్నట్లుగా ఉన్న ఓ కార్టూన్ అభిమానుల మనసుల్ని తాకుతోంది. టాటా గ్రూప్నకు జంషెట్జీ వ్యవస్థాపకుడు కాగా సంస్థను జేఆర్డీ కొత్త పుంతలు తొక్కించారు.
Similar News
News October 11, 2024
ఆరోగ్యానికి సీతాఫలం
ఈ సీజన్లో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. డిప్రెషన్కు లోనవ్వకుండా చేయడమే కాకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు.
News October 11, 2024
నేటి నుంచి రంజీ ట్రోఫీ
దేశంలో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ ఇవాళ ప్రారంభం కానుంది. 2024-25 సీజన్ దాదాపు 5 నెలలు కొనసాగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఫిబ్రవరి 8 నుంచి, సెమీ ఫైనల్స్ 17 నుంచి, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముంబై బరిలో దిగనుంది. ఓవరాల్గా ఆ జట్టు ఏకంగా 42 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.
News October 11, 2024
రతన్ టాటాపై పేటీఎం సీఈవో ట్వీట్.. నెటిజన్ల విమర్శలు
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాపై చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ను కోల్పోయామని పేర్కొంటూ చివర్లో టాటా బై బై అంటూ విజయ్ శేఖర్ రాసుకొచ్చారు. దీంతో దిగ్గజానికి వీడ్కోలు పలికే పద్దతి ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇది సరికాదంటూ హితవు పలికారు. అయితే కాసేపటికే ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.