News October 11, 2024

నమ్కిన్ ప్యాకెట్ల మాటున రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా

image

ఢిల్లీలో మరోసారి ₹వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. తాజాగా నమ్కిన్ ప్యాకెట్ల మాటున సరఫరా చేస్తున్న ₹2 వేల కోట్లు విలువచేసే 200 కేజీల కొకైన్‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన‌ ₹5,620 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సరఫరా ముఠాకు తాజాగా ఘటనతో సంబంధాలున్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న‌లుగురిని అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితుడు లండ‌న్ ప‌రారైన‌ట్టు తెలుస్తోంది.

Similar News

News October 11, 2024

ఆరోగ్యానికి సీతాఫలం

image

ఈ సీజన్‌లో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. డిప్రెషన్‌కు లోనవ్వకుండా చేయడమే కాకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు.

News October 11, 2024

నేటి నుంచి రంజీ ట్రోఫీ

image

దేశంలో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ ఇవాళ ప్రారంభం కానుంది. 2024-25 సీజన్ దాదాపు 5 నెలలు కొనసాగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8 నుంచి, సెమీ ఫైనల్స్ 17 నుంచి, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముంబై బరిలో దిగనుంది. ఓవరాల్‌గా ఆ జట్టు ఏకంగా 42 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.

News October 11, 2024

రతన్ టాటాపై పేటీఎం సీఈవో ట్వీట్.. నెటిజన్ల విమర్శలు

image

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాపై చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్‌ను కోల్పోయామని పేర్కొంటూ చివర్లో టాటా బై బై అంటూ విజయ్ శేఖర్ రాసుకొచ్చారు. దీంతో దిగ్గజానికి వీడ్కోలు పలికే పద్దతి ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇది సరికాదంటూ హితవు పలికారు. అయితే కాసేపటికే ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.