News October 11, 2024
9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు
TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
ఢిల్లీ వెళ్లనున్న ఉత్తమ్
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా NDSA ఛైర్మన్ అనిల్ జైన్తో భేటీ కానున్న ఆయన కాళేశ్వరం బ్యారేజీలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఛైర్మన్తోనూ సమావేశం కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై వారితో చర్చించడంతో పాటు నీటి నిల్వకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తారు.
News October 11, 2024
EVMలే కారణం: నేతలపై చిరాకుపడ్డ రాహుల్ గాంధీ!
హరియాణా ఓటమిపై సమీక్షలో రాహుల్ గాంధీ గుంభనంగా కూర్చున్నారని తెలిసింది. పరాజయానికి EVMలే కారణమని సభ్యులు చెప్తుంటే చిరాకు పడ్డారని సమాచారం. EVM, EC జవాబుదారీతనం, కౌంటింగ్ పరంగా తప్పెక్కడ జరిగిందో డీటెయిల్డ్ రిపోర్టు అడిగారు. గెలిచి తీరాల్సిన ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తుపై కాకుండా తమ ఎదుగుదలపై లోకల్ లీడర్లు ఆసక్తి చూపారని అనడంతో రూమ్ అంతా సైలెంటైంది. ఆ 2 పాయింట్లు అనేసి రాహుల్ వెళ్లిపోయారు.
News October 11, 2024
FLASH: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దసరా ముంగిట హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.77,400 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.700 ఎగసి రూ.70,950కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరగడంతో రూ.1,02,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.