News October 11, 2024
నీటి పారుదల శాఖకు రూ.284 కోట్లు విడుదల
AP: జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం నీటిపారుదల శాఖకు రూ.284.04 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో కాలువలు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటివి చేయనున్నారు. అంతకుముందు రూ.310 కోట్లతో ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అంచనా వ్యయాన్ని పంపింది.
Similar News
News October 11, 2024
EVMలే కారణం: నేతలపై చిరాకుపడ్డ రాహుల్ గాంధీ!
హరియాణా ఓటమిపై సమీక్షలో రాహుల్ గాంధీ గుంభనంగా కూర్చున్నారని తెలిసింది. పరాజయానికి EVMలే కారణమని సభ్యులు చెప్తుంటే చిరాకు పడ్డారని సమాచారం. EVM, EC జవాబుదారీతనం, కౌంటింగ్ పరంగా తప్పెక్కడ జరిగిందో డీటెయిల్డ్ రిపోర్టు అడిగారు. గెలిచి తీరాల్సిన ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తుపై కాకుండా తమ ఎదుగుదలపై లోకల్ లీడర్లు ఆసక్తి చూపారని అనడంతో రూమ్ అంతా సైలెంటైంది. ఆ 2 పాయింట్లు అనేసి రాహుల్ వెళ్లిపోయారు.
News October 11, 2024
FLASH: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దసరా ముంగిట హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.77,400 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.700 ఎగసి రూ.70,950కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరగడంతో రూ.1,02,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News October 11, 2024
‘ఇస్లామిక్ జిహాద్’ అగ్రకమాండర్ హతం: ఇజ్రాయెల్
హమాస్ మిత్ర సంస్థ ‘ఇస్లామిక్ జిహాద్’ అగ్రకమాండర్ మహ్మద్ అబ్దుల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. వెస్ట్ బ్యాంక్లోని శరణార్థుల శిబిరంలో దాక్కున్న అబ్దుల్లాను మరో ఉగ్రవాదితో కలిపి తమ బలగాలు మట్టుబెట్టాయని తెలిపింది. వారి దగ్గర M-16 రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇటీవల హతమైన ముహమ్మద్ జబ్బెర్ స్థానంలో అబ్దుల్లా చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడని వివరించింది.