News October 11, 2024

కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా చేయాలి: కౌన్సిలర్ల డిమాండ్

image

కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ నజీమున్నిసా రాజీనామా చేయాలని వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రయత్నించలేదని, శాసనసభ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయకపోగా.. ఓటమి కోసం పాటుపడ్డారని ఆరోపించారు. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా.. వారిని ఆపే ప్రయత్నం ఛైర్ పర్సన్ చేయలేదని అన్నారు.

Similar News

News September 18, 2025

ATP: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

News September 18, 2025

ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

image

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్‌గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

News September 18, 2025

గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

image

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.