News October 11, 2024
ఆ మ్యాచ్కి భారత జట్టు కెప్టెన్ ఎవరు?
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లలో ఒకదానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శర్మ గైర్హాజరయ్యే<<>> అవకాశం ఉండడంతో ఆ మ్యాచ్కి సారథ్యం వహించేది ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్లలో ఒకరికి కెప్టెన్గా ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
Similar News
News October 12, 2024
రేపటి మ్యాచ్లో ఈ ప్లేయర్లకు నో ఛాన్స్?
హైదరాబాద్ వేదికగా శనివారం బంగ్లాదేశ్తో జరగనున్న చివరి టీ20 మ్యాచ్లో ముగ్గురు భారత ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్లలో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయని సంజూ శాంసన్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి రావచ్చని తెలుస్తోంది. అలాగే, వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణాకు చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
News October 12, 2024
స్కిల్ వర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం
TG: స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(YISU) వెబ్సైట్ ద్వారా ఈ నెల 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. NOV 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో తరగతులు నిర్వహిస్తారు.
News October 12, 2024
న్యూజిలాండ్ సిరీస్కు భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్గా బుమ్రా
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమించింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫ్రాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా. ట్రావెలింగ్ రిజర్వ్: నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ.